పాక్‌ వక్రబుద్ధికి ఈ వీడియోనే సాక్ష్యం!

|

Sep 10, 2019 | 1:40 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులతో రెచ్చిపోతూనే.. మరోవైపు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్‌వోసీ వెంబడి ఇండియన్ ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేయడంతో దాయాది దేశం భారత్ దాడులు చేసేందుకు కొత్త మార్గాలు ఎన్నుకుంటుంది. పాక్‌ వక్రబుద్ధిని బయటపెట్టే వీడియోను సైన్యం విడుదల చేసింది. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ వేదికలపై ఏ దేశ మద్దతూ లభించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో […]

పాక్‌ వక్రబుద్ధికి ఈ వీడియోనే సాక్ష్యం!
Army foils Pakistan BAT infiltration bid along LoC; kills intruders, releases video
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్ కుట్ర చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులతో రెచ్చిపోతూనే.. మరోవైపు ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎల్‌వోసీ వెంబడి ఇండియన్ ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేయడంతో దాయాది దేశం భారత్ దాడులు చేసేందుకు కొత్త మార్గాలు ఎన్నుకుంటుంది.

పాక్‌ వక్రబుద్ధిని బయటపెట్టే వీడియోను సైన్యం విడుదల చేసింది. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ వేదికలపై ఏ దేశ మద్దతూ లభించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో వున్న పాక్‌.. సరిహద్దులో ఉండాల్సిన ఆ దేశ కమాండోలను భారత్‌లోకి చొరబాటుకు ఉసిగొల్పుతోంది. ఈ నేపథ్యంలోనే కెరాన్‌ సెక్టార్‌ ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు పాక్‌ కమాండోలు ఎలా యత్నిస్తున్నారో వివరించే వీడియోను భారత సైన్యం సోమవారం విడుదల చేసింది. పాకిస్థాన్‌ జాతీయ జెండాతో ఐదుగురు కమాండోలు ప్రవేశిస్తున్నట్టుగా ఈ వీడియోలో రికార్డయింది.

పాకిస్థాన్‌ సైన్యం సహకారంతో బోర్డర్‌ యాక్షన్‌ టీం (బ్యాట్‌) సభ్యులు కెరాన్‌ సెక్టార్‌ ద్వారా భారత్‌లోకి ఎలా చొరబాటుకు ప్రయత్నించిందనేది ఈ వీడియో స్పష్టంచేస్తోంది. వారిని భారత్‌ సైన్యం తెలివిగా మట్టుబెట్టింది. ఉగ్రవాదులతో చేతులు కలిసి భారత్‌పై దాడి చేయాలన్న పాక్‌ కుట్రలను భగ్నం చేసేందుకు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఉగ్రదాడులకు ఎలాంటి అవకాశం లేకుండా పాక్‌ ప్రయత్నాలను విఫలం చేస్తోంది.