కరీంనగర్లో కాకపుట్టిస్తోన్న కలెక్టర్ ఆడియో టేపుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దానిపై సీఎంవో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్తో.. తెలంగాణ కలెక్టర్ మాట్లాడిన ఆడియో టేపుల వ్యవహారం.. ఇప్పుడు మళ్లీ హాట్టాపిక్గా మారింది. దానిపై.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. బండి సంజయ్తో నేను మాట్లాడింది నిజమేనని కలెక్టర్ ఒప్పుకున్నారు. ఆయన.. తనను ఎన్నికల ఖర్చుల గురించి అడిగారని.. నిబంధనల ప్రకారమే వాటిని అప్లోడ్ చేస్తానని చెప్పానని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకూ చెబుతానని కలెక్టర్ సర్ఫరాజ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. తాజాగా.. ఆ ఆడియో టేపుల వివాదంపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్ర జరిగిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుందని ప్రశ్నించారు..? దొడ్డిదారిన నాపై వేటు వేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అయితే.. ఈ వివాదంపై ఇప్పుడు తాను మాట్లాడనని.. ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు.
తాజాగా.. వంశీ, రాజేంద్ర ప్రసాద్ల మధ్య రేగిన పరస్పర ఆరోపణల రగడకు స్వస్తి పలికిన నేపథ్యంలో.. ఆ మధ్య కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ల మధ్య తలెత్తిన వివాదాన్ని ఈ సందర్భంగా.. ప్రస్తావించవలసిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలపై ఇద్దరూ.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంత పరిస్థితి ఏర్పడింది.
నాడు అసలు బండి సంజయ్ ఏమన్నారు..?
మరోవైపు గ్రానైట్ వ్యాపారుల కథనం ఇలా ఉంది..!