వేములవాడలో సెల్ఫ్ లాక్‌డౌన్

|

Aug 21, 2020 | 3:48 PM

కరోనా వ్యాప్తి జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి....

వేములవాడలో సెల్ఫ్ లాక్‌డౌన్
Follow us on

Vemulawada Self Lockdown: కరోనా వ్యాప్తి జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 5 వరకు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించనున్నాయి. కరోనా కట్టిడిలో భాగంగా విధించిన ఈ లాక్ డౌన్‌ను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ లాక్ డౌన్‌కు మద్దతు తెలపగా. ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచించారు. కరోనా ఆంక్షలను తప్పని సరిగా పాటించాలని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తలను.. నగరవాసులను స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో నిత్యం 40 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. దీంతో  సెల్ఫ్ లాక్‌డౌన్‌తో నగరంలో కొంత  రద్దీ తగ్గింది.

ఇక పక్కనే ఉన్న జిల్లా కేంద్రం సిరిసిల్లలో మాత్రం లేదు. కానీ ఇక్కడ కూడా కరోనా కేసులు వస్తున్నప్పటికీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియంత్రన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.