Vijayawada 24 Special Trains: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ నెల 12వ తేదీ నుంచి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో స్పెషల్ ట్రైన్ల సంఖ్య పెరగనుంది. ఇప్పటివరకు ఈ డివిజన్లో 14 ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ.. ఇక నుంచి 24 స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. పలు ప్రాంతాల్లో రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో పాటు ప్రయాణీకుల రద్దీ కూడా పెరగడం వల్ల రైల్వే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రైన్స్ జిల్లాకు వచ్చి ఒక్క స్టేషన్లో మాత్రమే ఆగుతాయి. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి. ఈ 24 ట్రైన్లు కూడా ప్రత్యేక రైళ్లు మాదిరిగానే నడవనుండగా.. ప్రయాణీకులకు కరోనా పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించడం, బోగీలు శానిటైజేషన్ చేయడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి తప్పనిసరి నిబంధనలుగా పెట్టారు.
24 ప్రత్యేక రైళ్ల లిస్ట్ ఇదే…
Also Read:
ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..
విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!