దోచుకున్నదంతా మీదే..!

| Edited By:

Jun 07, 2019 | 11:43 AM

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. యనమల గారూ.. మీరు అడగడం, మేం ఇవ్వడం మొదలు పెడితే.. లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజ్, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు, ఇవ్వమని అడగగల సమర్ధులు మీరని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. కాగా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అని చంద్రబాబును ఉద్ధేశించి ప్రశ్నించారు. కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే […]

దోచుకున్నదంతా  మీదే..!
Follow us on

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. యనమల గారూ.. మీరు అడగడం, మేం ఇవ్వడం మొదలు పెడితే.. లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజ్, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు, ఇవ్వమని అడగగల సమర్ధులు మీరని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి.

కాగా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అని చంద్రబాబును ఉద్ధేశించి ప్రశ్నించారు. కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని, సమీక్షలో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారని అన్నారు. జన్మభూమి కమిటీలలో పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభమని అన్నారు.