Vijay Emotional Post: ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’లో ఓ చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తర్వాత నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో నటన విషయంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారాడు విజయ్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ విజయ్కి ఫేమ్తో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. రౌడీస్ అంటూ అభిమానులను ప్రేమగా పిలుచుకునే విజయ్.. వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ కొత్త చిత్రం ప్రకటనతో ఫ్యాన్స్ చేసిన హంగామానే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
విజయ్ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘లైగర్’ పేరుతో రానున్న ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్ ఫ్లెక్సీకి పూల దండలు వేసి హంగామా చేశారు. అభిమానులు తనపై చూపిన ప్రేమకు పొంగిపోయిన విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్వేదిక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అభిమానుల కోలాహలానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నిన్న మీరు చేసిన పనికి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. మీ ప్రేమ నా మనసును తాకింది. ఒకప్పుడు అనుకునేవాడిని.. నా పనితనాన్ని ఎవరు గుర్తిస్తారు? నా సినిమా ఎవరు చూస్తారు? అని! కానీ నిన్న కేవలం లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినందుకే రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని సృష్టించి నన్ను కదిలించారు. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.. మీరు టీజర్ కోసం వెయిట్ చేయండి. దేశమంతా పిచ్చెక్కించడం గ్యారెంటీ.. ప్రేమతో మీ విజయ్ దేవరకొండ” అని రాసుకొచ్చాడు.
Also Read: Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..