Uttarakhand Floods: మంచుచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ధౌలీగంగా వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం 13 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 62కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా గల్లంతైన 142 మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 62 మృతదేహాల్లో 33 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గుర్తించని 29 మృతదేహాల డీఎన్ఏలను భద్రపరుస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 7న సంభవించిన వరదల అనంతరం తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు గల్లంతైన వారికోసం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతమంతా బురద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. తాజాగా ఈ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read: