నేతల కళ్లు తెరిపించే పనిచేసిన మంత్రి శ్రీకాంత్ శర్మ

|

Nov 05, 2020 | 3:44 PM

ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ రాజకీయనేతలకు ఆదర్శప్రాయమైన పనిచేశారు. తాజాగా మరోసారి ఆయన తన కార్యాలయానికి సైకిల్‌ మీద వెళ్లారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. బంగ్లా బజార్‌, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌సెంటర్లకు కూడా ఆయన సైకిల్‌ పైనే వెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపి పనితీరును సమీక్షించారు. పలువురు వినియోగదారులను స్వయంగా కలసి, వారికి విద్యుత్‌ సరిగ్గా అందుతోందా? లేదా? అని […]

నేతల కళ్లు తెరిపించే పనిచేసిన మంత్రి శ్రీకాంత్ శర్మ
Follow us on

ఉత్తరప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి శ్రీకాంత్‌ శర్మ రాజకీయనేతలకు ఆదర్శప్రాయమైన పనిచేశారు. తాజాగా మరోసారి ఆయన తన కార్యాలయానికి సైకిల్‌ మీద వెళ్లారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణను గురించిన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. బంగ్లా బజార్‌, ఆషియానా ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌సెంటర్లకు కూడా ఆయన సైకిల్‌ పైనే వెళ్లి అక్కడ అధికారులతో చర్చలు జరిపి పనితీరును సమీక్షించారు. పలువురు వినియోగదారులను స్వయంగా కలసి, వారికి విద్యుత్‌ సరిగ్గా అందుతోందా? లేదా? అని ఆరా తీశారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలని చెప్పారు. దీంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో అక్కడికక్కడే బిల్లులు చెల్లించారు. భారీగా మంది మార్భలం వెంటేసుకుని లెక్కకు మించిన ప్రభుత్వ వాహనాల్లో నానా హంగామా చేసే రాజకీయనాయకులకు శ్రీకాంత్ శర్మ ఒక దిక్కూచి వంటి వారని స్థానికులు చెబుతున్నారు.