కాసేపట్లో ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ

| Edited By:

Jun 26, 2019 | 9:53 AM

భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఉన్నతస్థాయి చర్చల కోసం విదేశీ నుంచి ఓ మంత్రి రావడం ఇదే మొదటిసారి. మోదీతో పాటు భారతదేశ నూతన విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ పాంపియో భేటీ కానున్నారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసా, ఇరాన్ చమురు పై అమెరికా ఆంక్షలతో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు […]

కాసేపట్లో ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
Follow us on

భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఉన్నతస్థాయి చర్చల కోసం విదేశీ నుంచి ఓ మంత్రి రావడం ఇదే మొదటిసారి. మోదీతో పాటు భారతదేశ నూతన విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ పాంపియో భేటీ కానున్నారు. ఉగ్రవాదం, హెచ్-1బీ వీసా, ఇరాన్ చమురు పై అమెరికా ఆంక్షలతో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించనున్నారు.