అమెరికాలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులో..

| Edited By:

Apr 03, 2020 | 4:30 PM

కరోనావైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది తుది శ్వాస విడిచారు.

అమెరికాలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులో..
Follow us on

US Death Toll: కరోనావైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారత్ లోనూ ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది తుది శ్వాస విడిచారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా గురువారం వెల్లడైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం రాత్రి 8:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల్లో ఇప్పటివరకు ఇటలీ(969) ముందుండగా.. ప్రస్తుతం ఆ స్థానంలోకి అమెరికా(1169) చేరింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలో మొత్తం 2,45,380 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదుకాగా.. వాటిలో 503 కేసులు కొత్తగా నమోదైనవి.