పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే మా టార్గెట్

|

Nov 25, 2020 | 2:21 PM

బంగ్లాదేశ్‌, రోహింగ్యా ముస్లింలను రాజకీయ లబ్దికోసం కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే.. పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించినట్లు చెబుతున్నారని.. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల...

పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే మా టార్గెట్
Follow us on

Smriti Irani Clarifies : గ్రేటర్ వార్‌ జోన్‌లోకి మరో సెంట్రల్ లీడర్ ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు పాతబస్తీ సర్జికల్ స్ట్రైక్‌పై క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపైనే మా టార్గెట్ అంటూ క్లుప్తంగా కట్టె.. కొట్టే.. తెచ్చే అనే అనే రీతిలో చెప్పేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. హైదరాబాద్‌లో 75 వేల మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారన్న కేంద్ర మంత్రి.. దీనిపై టీఆర్ఎస్, మజ్లిస్‌లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నల వర్షం కురిపించారు.

బంగ్లాదేశ్‌, రోహింగ్యా ముస్లింలను రాజకీయ లబ్దికోసం కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదుచేస్తే.. పాతబస్తీలో రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించినట్లు చెబుతున్నారని.. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుస్మాన్ భారత్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే ఇప్పుడు కరోనా సోకిన నిజమైన పేదలకు లబ్ధి చేకూరేదని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై సమగ్ర నివేదిక కేంద్రానికి పంపలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తెలంగాణ ఒక్క కుటుంబం కోసం కాదని… ఎందరో త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కును మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.