బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, యూటీ(కేంద్రపాలిత ప్రాంతాలు) లకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాశ్జవదేకర్ ఈ విషయాలను వెల్లడించారు.
రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రభుత్వం పొందనుంది. దీన్దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద ఈ ప్యాకేజీని అందిస్తున్నారు. విద్యా సంబంధిత పథకం స్టార్ట్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసి) ఆధ్వర్యంలోని ఛత్తీస్గడ్లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్ డీమెజర్ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
#STARS project has been approved under the #NewEducationPolicy to support states in strengthening the school education system. @narendramodi government is implementing the #NEP2020 & as part of the process it has approved the Strengthening Teaching-Learning and Results for States pic.twitter.com/5MaAbOtEId
— Prakash Javadekar (@PrakashJavdekar) October 14, 2020
స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటుందని.. ఇది దాదాపు 90 శాతం పూర్తయింది. త్వరలోనే ఇది ప్రత్యేక సంస్థగా నమోదు చేయబడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.