దేశంలో కరోనా కరాళనృత్యంతో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు క్లాసు రూములు తెరవకుండా మూతపడ్డాయి. కాస్త పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా పునఃప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో తిరిగి కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోవడానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని.. దశల వారీగా విద్యా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. భౌతిక దూరంలో తరగతుల నిర్వహణకు ఆన్ లైన్ పద్దతిలో ప్రారంభానికి సంబంధించి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని సూచించింది. పూర్తిగా సిద్ధం అనుకున్న తర్వాతే కార్యకలాపాలను మొదలు పెట్టాలని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యాసంస్థల్లో తరగతుల పునఃప్రారంభానికి సంబంధించి ఆ విద్యాసంస్థల ప్రధాన అధికారులు సంతృప్తి చెందితేనే కార్యకలపాలు మొదలుపెట్టాలని యూజీసీ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తరగతుల నిర్వహణ పూర్తిగా ఆయా ప్రభుత్వాల నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్లను దశలవారీగా తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి విద్యాసంస్థలో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా సామాజిక దూరం, ఫేస్ మాస్క్ల వాడకం, ఇతర రక్షణ చర్యలకు కట్టుబడి ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది. వర్సిటీలు, కళాశాలల పరిపాలనా కార్యాలయాలు, పరిశోధనా ప్రయోగశాలలు, గ్రంథాలయాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొంది. అన్ని పరిశోధనా కార్యక్రమాల విద్యార్థులు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ పీజీ విద్యార్థులు తమ విద్యాలయాల్లో తిరిగి చేరవచ్చని తెలిపింది.
యూజీసీ కొత్త మార్గదర్శకాలుః