దారుణం..హిందూ షాపుల‌కు వెళ్లిన ముస్లిం మ‌హిళ‌ల‌ను..

| Edited By: Pardhasaradhi Peri

May 19, 2020 | 9:21 AM

భార‌త‌దేశం స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం. హిందూ-ముస్లిం సోద‌ర‌భావంతో మెలిగే గొప్ప దేశం మ‌న‌ది. అలాంటి దేశంలో హిందువుల షాపుకు వెళ్లిన ముస్లిం మ‌హిళ‌ల‌పై… కొంద‌రు ముస్లిం ఆక‌తాయిలు తిట్ల దండ‌కం అందుకోని అరాచ‌కం సృ‌ష్టించారు. మ‌న‌సు చివుక్కుమ‌నిపించే ఈ దారుణ‌ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. దావ‌ణ‌గెరెలో బుర్ఖా ధ‌రించిన ఇద్ద‌రు ముస్లిం మ‌హిళ‌లు.. ఓ షాపులో బ‌ట్టలు కొనుగోలు చేశారు. అయితే అది హిందువుల షాపు కావ‌డంతో..అక్క‌డే ఉన్న‌ కొంద‌రు ముస్లింలు వారిని అడ్డ‌గించి నోటికొచ్చిన‌విధంగా […]

దారుణం..హిందూ షాపుల‌కు వెళ్లిన ముస్లిం మ‌హిళ‌ల‌ను..
Follow us on

భార‌త‌దేశం స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం. హిందూ-ముస్లిం సోద‌ర‌భావంతో మెలిగే గొప్ప దేశం మ‌న‌ది. అలాంటి దేశంలో హిందువుల షాపుకు వెళ్లిన ముస్లిం మ‌హిళ‌ల‌పై… కొంద‌రు ముస్లిం ఆక‌తాయిలు తిట్ల దండ‌కం అందుకోని అరాచ‌కం సృ‌ష్టించారు. మ‌న‌సు చివుక్కుమ‌నిపించే ఈ దారుణ‌ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. దావ‌ణ‌గెరెలో బుర్ఖా ధ‌రించిన ఇద్ద‌రు ముస్లిం మ‌హిళ‌లు.. ఓ షాపులో బ‌ట్టలు కొనుగోలు చేశారు. అయితే అది హిందువుల షాపు కావ‌డంతో..అక్క‌డే ఉన్న‌ కొంద‌రు ముస్లింలు వారిని అడ్డ‌గించి నోటికొచ్చిన‌విధంగా తిట్టారు. బ‌ట్ట‌లు తీసుకొస్తోన్న సంచుల‌ను వారి చేతుల్లో నుంచి బ‌ల‌వంతంగా లాక్కుని దౌర్జ‌న్యం చేశారు.

‘ఏవైనా కొనాల‌నుకుంటే ముస్లింల షాపుల‌కు వెళ్లాలి కానీ, హిందువుల దుకాణంలో కొన‌డ‌మేంట’‌ని వారిపై అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించారు. వెంట‌నే ఆ ప్రాంతం వ‌దిలి వెళ్లిపోవాలంటూ బెదిరింపుల‌కు తెగ‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ శోభా తీవ్రంగా ఫైర‌య్యారు. “అది క‌ర్ణాట‌కా లేకా ఇత‌ర ఇస్లామిక్ కంట్రీనా? హిందువుల షాపులో కొన్నందుకు ఆ దుండ‌గులు ముస్లిం మ‌హిళ‌ల‌ను అవ‌హేళ‌న చేస్తారా? ఇలా మ‌త‌పిచ్చిప‌ట్టిన‌ తీవ్ర‌వాదుల‌కు భార‌త చ‌ట్టాల రుచి చూపించాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌డ‌తామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.