ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

|

Oct 09, 2020 | 8:56 AM

హైదరాబాద్ మహానగర శివారులోని ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
Follow us on

హైదరాబాద్ మహానగర శివారులోని ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతున్న సమయంలో నార్సింగి ఫ్లైఓవర్ కింద ఈ ఘటనచోటుచేసుకుంది. దీంతో ఓఆర్ ఆర్ పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రిలో చేర్చించారు. వీరంతా సూర్యాపేటకు చెందిన గుర్తించిన నార్సింగి పోలీసులు.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాగా, గచ్చిబౌలి వైపు వస్తున్న కారులోని వారంతా హయత్ నగర్ వద్ద మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.