అజ్మీర్‌లో బీజేపీ కార్యకర్తలు తిట్టుకుంటూ.. ఒకరిపై ఒకరు..

| Edited By: Anil kumar poka

Apr 12, 2019 | 1:28 PM

జైపూర్ : క్రమశిక్షణకు మారుపేరు తమ కార్యకర్తలు అని తరుచూ బీజేపీ పార్టీ అధినేతలు చెబుతుంటారు. కానీ అవన్నీ మాటలేనని తేటతెల్లమవుతోంది. మొన్న యూపీలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకోగా.. నిన్న రాజస్థాన్‌లో బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మసుడాలో బీజేపీ ర్యాలీ సమయంలో ఆ పార్టీ అభ్యర్థి భగీరథ్ చౌదరి ర్యాలీ నిర్వహించేందుకు వచ్చిన సమయంలో పార్టీ కార్యకర్తల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో […]

అజ్మీర్‌లో బీజేపీ కార్యకర్తలు తిట్టుకుంటూ.. ఒకరిపై ఒకరు..
Follow us on

జైపూర్ : క్రమశిక్షణకు మారుపేరు తమ కార్యకర్తలు అని తరుచూ బీజేపీ పార్టీ అధినేతలు చెబుతుంటారు. కానీ అవన్నీ మాటలేనని తేటతెల్లమవుతోంది. మొన్న యూపీలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకోగా.. నిన్న రాజస్థాన్‌లో బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మసుడాలో బీజేపీ ర్యాలీ సమయంలో ఆ పార్టీ అభ్యర్థి భగీరథ్ చౌదరి ర్యాలీ నిర్వహించేందుకు వచ్చిన సమయంలో పార్టీ కార్యకర్తల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు ఒకరినొకరు తిట్టుకుంటూ..ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కార్యకర్తల మధ్య ఎందుకు గొడవ ఏర్పడిందనే విషయం తెలియాల్సి ఉంది.