ఆ చట్టాల అమలుకు బ్రేక్ ఎలా? పీకే స్ట్రాటజీలో రెండు మార్గాలు!

| Edited By:

Dec 22, 2019 | 4:15 PM

సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనతా దళ్ యునైటెడ్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్ఆర్సీకి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్ కు చెందిన సీఎంలు పాల్గొనడం లేదని మండిపడ్డారు. తాజాగా సీఏఏ, ఎన్ఆర్సీలపై సోనియా గాంధీ స్పందించారు. బీజేపీ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో పీకే.. సోనియా గాంధీ వీడియోను రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పై కాంగ్రెస్ సీఎంలు స్పందించాలని పీకే కోరారు. లేకపోతే సోనియా గాంధీ […]

ఆ చట్టాల అమలుకు బ్రేక్ ఎలా? పీకే స్ట్రాటజీలో రెండు మార్గాలు!
Follow us on

సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనతా దళ్ యునైటెడ్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్ఆర్సీకి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్ కు చెందిన సీఎంలు పాల్గొనడం లేదని మండిపడ్డారు. తాజాగా సీఏఏ, ఎన్ఆర్సీలపై సోనియా గాంధీ స్పందించారు. బీజేపీ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

ఈ క్రమంలో పీకే.. సోనియా గాంధీ వీడియోను రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పై కాంగ్రెస్ సీఎంలు స్పందించాలని పీకే కోరారు. లేకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని తెలిపారు. అయితే సీఏఏ కు జనతాదళ్ యునైటెడ్ తమ పార్టీ మద్దతు తెలిపింది. ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాగా.. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఎన్ఆర్సీకి మాత్రం మద్దతు తెలిపేది లేదని, తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.

సీఏఏ, ఎన్ఆర్సీల అమలును ఆపడానికి రెండు మార్గాలను ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు. అన్ని వేదికలపై మీ గొంతును పెంచడం ద్వారా శాంతియుతంగా నిరసన తెలుపండని సూచించారు. బీజేపీయేతర రాష్ట్రాలలో 16 మంది సీఎంలు అందరూ తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీకి నో చెప్పాలని పిలుపునిచ్చారు.

[svt-event date=”22/12/2019,3:14PM” class=”svt-cd-green” ]

[svt-event date=”22/12/2019,3:13PM” class=”svt-cd-green” ]