సంచలన నిర్ణయం దిశగా ట్విట్టర్..!

| Edited By:

Oct 31, 2019 | 6:17 PM

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంపై ప్రక్షలన చేపట్టేందుకు నడుంబిగించింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ట్విట్టర్. ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. అయితే ఈ నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న వెల్లడిస్తామన్నారు. […]

సంచలన నిర్ణయం దిశగా ట్విట్టర్..!
Follow us on

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారంపై ప్రక్షలన చేపట్టేందుకు నడుంబిగించింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ట్విట్టర్. ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. అయితే ఈ నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15న వెల్లడిస్తామన్నారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అన్ని రాజకీయ ప్రకటనలను తమ వేదిక నుండి నిషేధిస్తున్నట్లు జాక్ తెలిపారు. “రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప.. వాటిని కొనకూడదు” అంటూ ట్వీట్ కూడా చేశారు. నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామన్నారు.