ఇక ఏటీఎంలో డబ్బు తీయాలంటే ఓటీపీ కంపల్సరీ

|

Sep 17, 2020 | 8:08 PM

ఏటీఎంలో డబ్బు తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఇక మరింత కీలకం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన తెచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది.

ఇక ఏటీఎంలో డబ్బు తీయాలంటే ఓటీపీ కంపల్సరీ
Follow us on

ఏటీఎంలో డబ్బు తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఇక మరింత కీలకం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన తెచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ ఇది వర్తిస్తుంది. ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. అంటే.. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు.. అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్‌ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి న‌గ‌దు తీసుకోలేరు. ఇప్పటివరకూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.