టీటీడీ ఛైర్మన్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు

| Edited By:

Jun 13, 2019 | 10:32 AM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. స్విమ్స్‌లో ఉద్యోగ నియమాకాల విషమమై స్విమ్స్ డైరక్టర్ రవికుమార్‌పై పుట్టా ఒత్తిడి చేశారని నివేదిక పంపింది. గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ తనపై సుధాకర్ యాదవ్ ఒత్తిడి చేసినట్లు రవికుమార్ రాతపూర్వకంగా టీటీడీకి ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగా విచారణ జరిపారు. ఆయన […]

టీటీడీ ఛైర్మన్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. స్విమ్స్‌లో ఉద్యోగ నియమాకాల విషమమై స్విమ్స్ డైరక్టర్ రవికుమార్‌పై పుట్టా ఒత్తిడి చేశారని నివేదిక పంపింది. గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ తనపై సుధాకర్ యాదవ్ ఒత్తిడి చేసినట్లు రవికుమార్ రాతపూర్వకంగా టీటీడీకి ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగా విచారణ జరిపారు. ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు టీటీడీ ఉన్నతాధికారులు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో పుట్టాపై వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.