జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పద్ధతికే మా ఓటు..

|

Sep 24, 2020 | 5:40 PM

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతినే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ కోరింది‌. కొవిడ్  నేపథ్యంలో ఈవీఎం(EVM)లైతే... ఇబ్బందులు వస్తాయి కాబట్టి పేపర్‌ అయితే బెటరని స్పస్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో....

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పద్ధతికే మా ఓటు..
Follow us on

 TRS urges to EC : రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతినే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ కోరింది‌. కొవిడ్  నేపథ్యంలో ఈవీఎం(EVM)లైతే… ఇబ్బందులు వస్తాయి కాబట్టి పేపర్‌ అయితే బెటరని స్పస్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో తమ అభిప్రాయాన్ని టీఆర్‌ఎస్ తెలిపింది‌. ఆ పార్టీ నుంచి శ్రీనివాసరెడ్డి, భరత్‌ ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ నిర్ణయాన్ని వివరించారు.

మరోవైపు గ్రాడ్యుయేషన్‌ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయిలో వ్యూహాన్ని రచిస్తోంది టీఆర్‌ఎస్‌ పార్టీ. జిల్లాల్లో లీడర్లను సమాయత్తం చేస్తూ కేటీఆర్ వరస మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. ఇవాళ ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల ఇన్‌చార్జ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంచార్జ్‌లకు మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఏదో రూపేణ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేలు చేస్తోందని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారన్న విషయాన్ని ఓటర్లకు గుర్తు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు‌.