Director Tested Corona Positive: ఓవైపు కరోనా తీవ్రత తగ్గుతోందని వార్తలు వస్తున్నా అడపాదడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత బాగా పెరిగిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం కరోనా బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్కు చెందిన మరో ప్రముఖ దర్శకుడు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.
ఆయన మరెవరో కాదు దర్శకుడు క్రిష్. లాక్డౌన్ నిబంధనలను సడలించిన వెంటనే సినిమా చిత్రీకరణ మొదలు పెట్టిన క్రిష్.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్తో చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న సమయంలోనే రకుల్కు కూడా కరోనా పాజిటివ్గా తేలడం గమనార్హం. దీంతో చిత్ర యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా పాజిటివ్ అని తేలగానే క్రిష్ వెంటనే.. క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. ఇక క్రిష్ ప్రస్తుతం పవన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతోన్న వేళ.. దర్శకుడు కరోనా బారిన పడడంతో పవన్ సినిమా మరింత ఆలస్యం కానుంది.