Tirumala News Today: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) శుభవార్త అందించింది. నేటి నుంచి స్లాటెడ్ సర్వ దర్శన టోకెన్ల పున: ప్రారంభించింది. జనవరి 4వ తేది సర్వ దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఈరోజు అర్ధరాత్రి నుంచి తిరుమలలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో భక్తులకు అందుబాటులో ఉంచింది. అటు టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతో పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు సర్వదర్శన టోకెన్లను డిసెంబర్ 24నే భక్తులకు కేటాయించిన సంగతి విదితమే.
Also Read: కోవిడ్ హాట్స్పాట్గా చెన్నై లగ్జరీ హోటల్.. 85 మందికి పాజిటివ్ నిర్ధారణ..