60 సంవత్సరాలు దాటిన వారికి.. 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం

| Edited By: Ravi Kiran

Feb 14, 2020 | 6:29 AM

తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం లభించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ధృవీకరించారు. దీని కోసం రెండు సమయాలను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 3 గంటలకు ఈ ఉచిత దర్శనానికి తగిన సమయాలని సూచించారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు ఫోటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని ఎస్‌-1 కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుంది. […]

60 సంవత్సరాలు దాటిన వారికి.. 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం
Follow us on

తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం లభించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ధృవీకరించారు. దీని కోసం రెండు సమయాలను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 3 గంటలకు ఈ ఉచిత దర్శనానికి తగిన సమయాలని సూచించారు.

అయితే దర్శనానికి వచ్చే భక్తులు ఫోటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని ఎస్‌-1 కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుంది. ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబారన్నం,
పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు.

రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ చొప్పున ఎన్ని టోకెన్లయినా ఇస్తారు. కౌంటర్‌ నుంచి గుడికి – గుడి నుంచి కౌంటర్‌ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు. వీరి దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేయబడుతాయి. ఎటువంటి వత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది..