టిక్ టాక్ యాప్.. అనతికాలంలోనే ప్రాచూర్యం పొందిన సోషల్ మీడియా యాప్.. అంతేకాదు.. కోట్లమంది యూజర్లు దీనికి అడిక్ట్ అయ్యారంటే అతిశయోక్తికాదు. అయితే కోట్లమంది యూజర్లను కల్గిన ఈ యాప్ ఇక వినియోగదారులను మరింత దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తోంది. అందు కోసం ఏకంగా.. టిక్టాక్ నుంచి ఓ నూతన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమైంది. టిక్టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ3 పేరుతో.. ఓ న్యూ స్మార్ట్ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.
టిక్టాక్ స్మార్టిజన్ జియాంగో ప్రొ 3 స్మార్ట్ఫోన్ ప్రత్యేకతలు..
డిస్ప్లే 6.39 ఇంచులు
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్,
ర్యామ్ : 8జీబీ/12 జీబీ
స్టోరేజ్ : 128/256 జీబీ
డ్యూయల్ సిమ్
48,13, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0,
యూఎస్బీ టైప్ సి
బ్యాటరీ కెపాసిటీ 4000 Mhz
అంతేకాదు.. ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను కూడా ఏర్పాటు చేశారు.