కిక్కుతో రోడ్డెక్కితే..పోలీసులు బెండు తీశారు..

| Edited By: Ram Naramaneni

Jan 01, 2020 | 3:41 PM

ముగ్గురు యువకులు.. ఫుల్లుగా మందుకొట్టి ఈల వేస్తూ పాటలు పాడుతూ బైక్ పై రయ్యిన దూసుకుపోతున్నారు. మనుషులు ఊగుతున్నారు. బండి ఊగుతోంది. ఈ పరిస్థితిలో పోలీసుల కంటబడితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఒకే బండిపై వెళుతున్నారు. వీరి చేష్టల్ని గమనించిన పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. ఇంకేముంది.. ముగ్గురికి బడితపూజ చేశారు పోలీసులు. పొడవాటి కర్రతో మత్తు దిగేవరకు చితక్కొట్టారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని చంద్రంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వద్దు […]

కిక్కుతో రోడ్డెక్కితే..పోలీసులు బెండు తీశారు..
Follow us on

ముగ్గురు యువకులు.. ఫుల్లుగా మందుకొట్టి ఈల వేస్తూ పాటలు పాడుతూ బైక్ పై రయ్యిన దూసుకుపోతున్నారు. మనుషులు ఊగుతున్నారు. బండి ఊగుతోంది. ఈ పరిస్థితిలో పోలీసుల కంటబడితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఒకే బండిపై వెళుతున్నారు. వీరి చేష్టల్ని గమనించిన పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. ఇంకేముంది.. ముగ్గురికి బడితపూజ చేశారు పోలీసులు. పొడవాటి కర్రతో మత్తు దిగేవరకు చితక్కొట్టారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని చంద్రంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వద్దు సార్ అంటూ ఏడుస్తూ వేడుకున్నా.. వారిని పోలీసులు వదల్లేదు. కర్ర విరిగేవరకు కొట్టారు. బూటు కాలితో ఆ యువకులకు చుక్కలు చూపించారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఎంత తాగినా.. ఇదేం దండన అంటూ పోలీసులపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.