పతాంజలి ‘కరోనిల్‌’తో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన లండన్ పరిశోధకులు. ఇప్పటికే అమ్ముడుపోయిన 25 లక్షల కిట్లు.

|

Dec 21, 2020 | 5:24 PM

ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న కరోనాను అంతమొందించడానికి తాను తీసుకొచ్చిన ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని. దీంతో కరోనా మహమ్మారి పారిపోతుందని బాబా రాందేవ్ బాగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

పతాంజలి ‘కరోనిల్‌’తో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన లండన్ పరిశోధకులు. ఇప్పటికే అమ్ముడుపోయిన 25 లక్షల కిట్లు.
Follow us on

There is no use with patanjali coronil kit: ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న కరోనాను అంతమొందించడానికి తాను తీసుకొచ్చిన ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని. దీంతో కరోనా మహమ్మారి పారిపోతుందని బాబా రాందేవ్ బాగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పతాంజలి సంస్థ తయారు చేసిన స్వసారి కరోనిల్ కిట్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. ఈ కిట్ మార్కెట్‌లోకి రాగానే జనాలు విరగబడి మరీ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు అమ్ముడు పోయాయి.
అయితే ఈ స్వసారి కరోనిల్ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, ఇది కొవిడ్ నుంచి ఏ మాత్రం రక్షణ కల్పించలేదని లండన్‌కు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం బర్మింగ్ హామ్ తేల్చి చెప్పింది. కరోనాను తరమి కొట్టడం పక్కన పెడితే కనీసం రోగ నిరోధక శక్తిని కూడా ఈ కిట్ పెంచుతుందని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధకులు వెల్లడించారు. బాబా రాందేవ్‌ జూన్‌ 23న కరోనిల్‌ కిట్లను విడుదల చేసి విషయం తెలిసిందే.