కోయంబత్తూరు వీధుల్లో భిక్షమెత్తుతున్న విదేశీయుడు…. ఎందుకై ఉంటుంది..?

| Edited By:

Feb 19, 2020 | 7:13 PM

బోలెడు డబ్బుంటే ఏం లాభం? మెంటల్‌ పీస్‌ లేకపోతే...! కరువైన ఆ మానసిక ప్రశాంతత కోసమే స్వీడెన్‌ నుంచి ఓ యువ పారిశ్రామికవేత్త కోయంబత్తూర్‌కు వచ్చాడు... అక్కడి ఈషాయోగా సెంటర్‌లో బస చేసాడు...

కోయంబత్తూరు వీధుల్లో భిక్షమెత్తుతున్న విదేశీయుడు.... ఎందుకై ఉంటుంది..?
Follow us on

బోలెడు డబ్బుంటే ఏం లాభం? మెంటల్‌ పీస్‌ లేకపోతే…! కరువైన ఆ మానసిక ప్రశాంతత కోసమే స్వీడెన్‌ నుంచి ఓ యువ పారిశ్రామికవేత్త కోయంబత్తూర్‌కు వచ్చాడు… అక్కడి ఈషాయోగా సెంటర్‌లో బస చేసాడు… అక్కడి బడుగు బలహీనవర్గాల కోసం అవిశ్రాంతంగా పనిచేసాడు.. అయినా ఆశించిన మానసిక ప్రశాంతత అతనికి లభించలేదు… ఇలా లాభం లేదనుకున్న అతడు కోయంబత్తూరు వీధుల్లో రెండు చేతులూ జోడించి బిక్షమెత్తుకోవడం మొదలు పెట్టాడు… దయగలవాళ్లు ఇచ్చే ఐదు పది రూపాయలు తీసుకుంటున్నాడు… అలా అడుక్కుని సంపాదించిన సొమ్మునంతా పేద ప్రజలకే పంచేస్తున్నాడతడు! ఇందులోనైనా అతనికి మెంటల్‌పీస్‌ లభిస్తుందో లేదో చూడాలి…