ప్రాణం తీసిన గుంత.. నదిలో పడి వ్యక్తి మృతి

|

Aug 18, 2020 | 4:53 PM

రోడ్డు గుంత ఓ వ్యక్తి నిండు ప్రాణం బలితీసుకుంది. తాండూరు కాగ్నా నది వద్ద అదుపుతప్పిన ఓ వ్యక్తి నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన గుంత.. నదిలో పడి వ్యక్తి మృతి
Follow us on

రోడ్డు గుంత ఓ వ్యక్తి నిండు ప్రాణం బలితీసుకుంది. తాండూరు కాగ్నా నది వద్ద అదుపుతప్పిన ఓ వ్యక్తి నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలం బొజ్జ నాయక్ తండాకు చెందిన కిషన్ చవాన్ తన భార్యతో కలిసి తాండూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగ్నానది బ్రిడ్జిపై పాడైన రోడ్డుపై నుంచి వెళ్తుండగా గుంత రావడంతో బైక్‌ అదుపుతప్పింది. బైక్‌తో సహా… కిషన్ చవాన్ అతని భార్య కిందపడిపోయారు. కాగా కిషన్ జారిపోయి పక్కనే ఉన్న నదిలో పడిపోయాడు. అటువైపు వెళ్తున్న వాహనదారులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. నదిలో నుంచి బయటికి తీసిన కిషన్‌ను తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.