నేటి నుంచి కృష్ణమ్మకు నవ హారతులు

|

Sep 18, 2020 | 5:45 PM

కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త. ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రి పై భక్తుల పూజలకు అనుమతి ఇచ్చారు. పల్లకి సేవ, పంచ హారతులు, దర్బార్ సేవ లో భక్తులను అనుమతించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

నేటి నుంచి కృష్ణమ్మకు నవ హారతులు
Follow us on

కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త. ఈ రోజు నుంచి ఇంద్రకీలాద్రి పై పూజలకు అనుమతి ఇచ్చారు. పల్లకి సేవ, పంచ హారతులు, దర్బార్ సేవ లో భక్తులను అనుమతించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఆన్ లైన్ లో పూజల టిక్కెట్లను కూడా దుర్గగుడి అధికారులు విడుదల చేస్తున్నారు. నేటి నుంచి కృష్ణా నదిలో క్రిష్ణమ్మ నదీ హారతి ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 నిముషాలకు దుర్గాఘాట్ లో క్రిష్ణమ్మ నదీ హారతులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే కరోనా వ్యాప్తి ద్రుష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. లాక్ డౌన్ ఆరు నెలల తర్వాత క్రిష్ణమ్మ నదీ హారతులను దుర్గగుడి అధికారులు ప్రారంభిస్తున్నారు. పవిత్ర కృష్ణమ్మకు శుక్రవారం సాయంత్రం నుంచి నవ హారతులు తిరిగి ప్రారంభించేందుకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులలో భాగంగా ఈ ఏడాది జనవరిలో నవ హారతులను నిలిపివేశారు. ఫ్లై ఓవర్‌ పనులు పూర్తికావడంతో శుక్రవారం నుంచి తిరిగి హారతులను ప్రారంభించాలని దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.