కరోనా లాక్ డౌన్: మంగళగిరి ఎయిమ్స్ లో టెలీ కన్సల్టేషన్ సేవలు షురూ..

| Edited By:

Apr 26, 2020 | 4:18 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో రోగుల సౌకర్యార్థం టెలీ కన్సల్టేషన్‌ సేవలను ప్రారంభించారు. రోగులు తమ పేర్లను

కరోనా లాక్ డౌన్: మంగళగిరి ఎయిమ్స్ లో టెలీ కన్సల్టేషన్ సేవలు షురూ..
Follow us on

Teleconsultation : కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో రోగుల సౌకర్యార్థం టెలీ కన్సల్టేషన్‌ సేవలను ప్రారంభించారు. రోగులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకుని ఫోన్‌ కాల్స్‌, లేదా వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా నిపుణులను సంప్రదించి వైద్యసేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.

కాగా.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9-11 గంటల మధ్య పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలి. నంబర్‌కు ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్‌ చేసి వైద్యసేవలు అందజేస్తారు. సందేహాలు, సలహాల కోసం 94930 65718, 85230 07940 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.