తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్సెస్సి పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, టెన్త్ పరీక్షలు 2020 మార్చి 19 నుండి 2020 ఏప్రిల్ 6 వరకు జరుగుతాయి. పరీక్షా సమయాలు అంతకుముందు సంవత్సరం లాగే ఉదయం 9:30 గంటల నుండి 1 గంట వరకు కొనసాగుతాయి.