60 మందికి నక్సల్స్‌తో లింక్.. లిస్ట్ రిలీజ్ చేసిన పోలీసులు

| Edited By:

Jan 22, 2020 | 1:13 PM

తెలంగాణలో 60 మంది అర్బన్ నక్సల్స్ పేర్లను జాబితాలో చేర్చారు పోలీసులు. లిస్ట్‌లో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా.. ఈ లిస్ట్‌లో పలువురు ప్రజా సంఘాల నేతల పేర్లను కూడా పోలీసులు పొందుపరిచారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలను కూడా పోలీసులు.. అర్బన్ నక్సల్స్‌గా పరిగణించారు. మొత్తం 60 మంది పేర్లతో లిస్ట్ […]

60 మందికి నక్సల్స్‌తో లింక్.. లిస్ట్ రిలీజ్ చేసిన పోలీసులు
Follow us on

తెలంగాణలో 60 మంది అర్బన్ నక్సల్స్ పేర్లను జాబితాలో చేర్చారు పోలీసులు. లిస్ట్‌లో మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులతో పాటు, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా.. ఈ లిస్ట్‌లో పలువురు ప్రజా సంఘాల నేతల పేర్లను కూడా పోలీసులు పొందుపరిచారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి విభాగం, చైతన్య మహిళా సమాఖ్య, డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ నేతలను కూడా పోలీసులు.. అర్బన్ నక్సల్స్‌గా పరిగణించారు. మొత్తం 60 మంది పేర్లతో లిస్ట్ రెడీ చేసి.. వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉప్పా) కింద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసారు. అక్టోబర్ 19.2019న చర్ల పోలీస్ స్టేషన్‌లో 45 మందికి పైగా మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు కేసు పెట్టారు.

నవంబర్ 12న 2019లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు రవి శర్మ, అనురాధ, సుదర్శన్, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు, మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు వేణుగోపాల్, మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరి భూషణ్, విరసం నేతలు ప్రొఫెసర్ వేణుగోపాల్ పైన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ఎల్బీనగర్‌లో నమోదైన కేసులో ఏ-8గా ప్రొఫెసర్ కాశిం పేరు ఉంది. 60 మందిపై సంఘవిద్రోహ శక్తుల కింద సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రొఫెసర్ కాశింకు మావోయిస్టులతో ఉన్న సంబంధాల ఆధారాలను రేపు హైకోర్టులో పోలీసులు సమర్పించనున్నారు. మొత్తం 60 మందికి మావోయిస్టులతో గల లింకులు ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఆయా కేసుల వివరాలను పోలీసులు కోర్టు ముందు ఉంచనున్నారు.