TSRTC: తెలంగాణ ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందింది. తెలంగాణ ఆర్టిసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమ్మె కాలానికి రూ.235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గతేడాది దాదాపు 60 రోజులకు పైగా సమ్మె చేసిన విషయం తెలిసిందే. సమ్మెకాలనికి సంబంధించిన జీతభత్యాలను తప్పకుండా చెల్లిస్తామని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆయన తన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టిసి కార్మికులకు జీతాలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
Also Read : ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డేకి స్టేడియం ఖాళీ..?