రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు షురూ.. ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్న అధికారులు.. పేర్లు నమోదుకు అవకాశం..!

|

Dec 10, 2020 | 9:53 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు షురూ..  ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్న అధికారులు.. పేర్లు నమోదుకు అవకాశం..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కరోనా వ్యాక్సిన్‌ కు అర్హులైన వారు తమ పేర్లను నమో దు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందిస్తోంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. దీన్ని కోవిడ్‌ యాప్‌గా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, వచ్చేనెల రెండో వారం నుం చి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసేం దుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటివరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గత రెండ్రోజులుగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు యాప్‌నకు సం బంధించి సన్నాహాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడత దాదాపు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు మొదటి దఫా వ్యాక్సిన్ వేయనున్నారు. దాదాపు మొత్తం కలిపి 3 లక్షల మంది వివరాలను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ సేకరించి వివరాలను కేంద్రానికి పంపింది. ఇక, మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వీరే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారెవరైనా కరోనా వ్యాక్సిన్‌ పొందడానికి అర్హులే అయినందున ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పేర్లు నమోదు చేసుకున్నాక అర్హుల జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరిస్తారు. తుది జాబితా ప్రకారం వ్యాక్సిన్‌ను అందజేస్తామని చెబుతున్నారు. కాగా, మొత్తంగా రాష్ట్రంలో 3 కోట్ల టీకాల ను నిల్వ చేసే సామర్థ్యమున్నట్లు అధికారులు చెబుతున్నారు.