తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..

| Edited By:

Jun 22, 2020 | 8:08 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..
Follow us on

Good news to farmers: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతి ఒక్కరికి రైతుబంధు అందనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read: ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!