తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్.. కొత్తగా 643 మందికి పాజిటివ్

|

Dec 10, 2020 | 10:15 AM

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 643 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్.. కొత్తగా 643 మందికి పాజిటివ్
Follow us on

రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 643 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. మంగళవారం రాత్రి 8గంటల నుంచి బుధవారం రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 643 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారిన పడడి బుధవారం మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,482కి చేరుకుంది. కరోనా మహమ్మారి జయించి బుధవారం 805 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,66,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరిందని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.