తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..ఒక్క‌రోజే 199

|

May 31, 2020 | 10:34 PM

తెలంగాణలో క‌రోనా విజృంభిస్తోంది. కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపుతుంది. ఇక‌ రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కోవిడ్-19 కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. ఇతర రాష్ట్రాల […]

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..ఒక్క‌రోజే 199
Follow us on

తెలంగాణలో క‌రోనా విజృంభిస్తోంది. కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపుతుంది. ఇక‌ రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కోవిడ్-19 కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ముగ్గురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2,698 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది వ్యాధి న‌య‌మై వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 82కి చేరింది.