సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష – చరణ్ రెడ్డి వివాహం నేడే, పాటిగడ్డ చర్చిలో పెళ్లి వేడుక, జోరుగా ఏర్పాట్లు

|

Dec 28, 2020 | 8:14 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు ఉదయం10 గంటలకు జరుగనుంది. రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం ఆల్వాల్..

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష - చరణ్ రెడ్డి వివాహం నేడే, పాటిగడ్డ చర్చిలో పెళ్లి వేడుక, జోరుగా ఏర్పాట్లు
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు ఉదయం10 గంటలకు జరుగనుంది. రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం ఆల్వాల్ గ్రామపంచాయతీ పరిధిలో పాటిగడ్డ లూర్డు మాత చర్చీలో ఈ పెళ్లివేడుక నిర్వహిస్తున్నారు. పెళ్ళి ఏర్పాట్లును స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన జైన్ మేరీ – మర్ రెడ్డిల కుమారుడు చరణ్ రెడ్డి తో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిపిస్తారు. ఈ పెళ్లికి మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర అధికారులు రానున్నట్లు పెళ్లికుమారుడి తల్లి టీవీ9కి తెలిపారు. కాగా, నిన్న జరిగిన ఒక వేడుకలో కేసీఆర్ సతీమణి శోభ, దత్తపుత్రిక ప్రత్యూషకు చీరెలు, డైమెండ్ నక్లెస్ సెట్ ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే.