తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. ప్రగతిభవన్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డుమార్గంలో కేసీఆర్ నిజామాబాద్ చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి 4.30 గంటలకు ప్రగతిభవన్కు చేరుకుంటారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా.. మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించే ద్వాదశ దినకర్మలో సీఎం పాల్గొంటారు.