కరోనాతో తండ్రి మృతి.. అంత్యక్రియల్లో పాల్గొన్న కొడుకు మృతి

|

Aug 11, 2020 | 10:31 AM

కరోనా కాటుకు అమాయకులు సైతం బలవుతున్నారు. ఏ అనారోగ్యం లేని వారు కూడా కొవిడ్ బారినపడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడికి వైరస్ సోకి మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కరోనాతో తండ్రి మృతి.. అంత్యక్రియల్లో పాల్గొన్న కొడుకు మృతి
Follow us on

కరోనా కాటుకు అమాయకులు సైతం బలవుతున్నారు. ఏ అనారోగ్యం లేని వారు కూడా కొవిడ్ బారినపడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనాతో మరణించిన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడికి వైరస్ సోకి మరణించిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సత్యనారాయణరావు బెంగళూరు నగరంలో నివాసముంటున్నాడు. అక్కడే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గంజాం జిల్లా దిగపహండి గ్రామానికి చెందిన సత్యనారాయణరావు తండ్రి శంకర్ రావు కరోనా వైరస్ తో జులై 14వతేదీన మరణించారు. తండ్రి శంకర్ రావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సత్యానారాయణరావు బెంగళూరు నుంచి తన స్వగ్రామానికి వచ్చారు. కరోనాతో మరణించిన తండ్రి శంకర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న కుమారుడు సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతన్ని బెర్హంపూర్ లోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సత్యనారాయణ బెంగళూరు తిరిగి వెళదామనుకున్నారు. పూర్తిగా కోలుకుని తిరిగి బెంగళూరు వెళ్లేందుకు భువనేశ్వర్ లోని బిజూపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ మరోసారి సత్యానారయణరావు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతన్ని అస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. కరోనాతో తండ్రి, కుమారుడు మరణించిన ఘటన కుటుంబసభ్యులను విషాదంలో ముంచెత్తింది.