సెన్సేషనల్‌గా మారిన కేశినేని నాని ట్వీట్..!

| Edited By:

Jul 17, 2019 | 11:23 AM

ప్రస్తుతం రాజకీయ నాయకులు ట్వీట్లతోనే సమాధానాలు చెబుతున్నారు. ఏపీలో ట్వీట్ల వార్ ముదురుతోన్న విషయం తెలిసిందు. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వార్నింగ్ కూడా వెళ్లింది. అయితే.. తనదారి తనదే అన్నట్టుగా కేశినేని నాని మాత్రం ట్వీట్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఓ నేతను ఉద్ధేశిస్తూ.. ‘ప్రబుద్ధుడు.. చెప్పింది అక్షర సత్యం.. నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా.. ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా.. […]

సెన్సేషనల్‌గా మారిన కేశినేని నాని ట్వీట్..!
Follow us on

ప్రస్తుతం రాజకీయ నాయకులు ట్వీట్లతోనే సమాధానాలు చెబుతున్నారు. ఏపీలో ట్వీట్ల వార్ ముదురుతోన్న విషయం తెలిసిందు. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి వార్నింగ్ కూడా వెళ్లింది. అయితే.. తనదారి తనదే అన్నట్టుగా కేశినేని నాని మాత్రం ట్వీట్ వార్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.

ఓ నేతను ఉద్ధేశిస్తూ.. ‘ప్రబుద్ధుడు.. చెప్పింది అక్షర సత్యం.. నంబర్ ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా.. ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా.. 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి వూరoదరూ దొంగలులానే కనపడతారు.’ అని ట్వీట్ చేశారు. ఏ ఉద్ధేశ్యంతో నాని ట్వీట్ చేశారని రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.