పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్​కు కరోనా పాజిటివ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 05, 2020 | 6:10 PM

కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బోడే ప్రసాద్​కు కరోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయ్యింది. గత నెల 17వ తేదీన పెనమలూరు ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ లో కొవిడ్ -19 టెస్టులు చేయించుకోగా... రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చింది.

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్​కు కరోనా పాజిటివ్
Follow us on

కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బోడే ప్రసాద్​కు కరోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయ్యింది. గత నెల 17వ తేదీన పెనమలూరు ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ లో కొవిడ్ -19 టెస్టులు చేయించుకోగా… రిపోర్ట్స్ లో నెగిటివ్ వచ్చింది. మళ్లీ జలుబు,  దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న బోడే ప్ర‌సాద్ దంపతులు తాజాగా మ‌ళ్లీ టెస్టులు చేయించుకున్నారు. శనివారం బోడే ప్రసాద్​కు క‌రోనా పాజిటివ్ అని తేలింది.ఆయన భార్య హేమా చౌదరికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో బోడే ప్రసాద్​ను హోం ఐసోలేషన్​లో ఉంచారు. ఆయన భార్యకు హోం క్వారంటైన్ విధించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పంచాయతీ అధికారులు అప్ర‌మ‌త్తమై..మాజీ ఎమ్మెల్యే ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో శానిటేష‌న్ ప‌నులు చేయిస్తున్నారు.

బోడె ప్రసాద్‌ దాదాపు 15 రోజుల నుంచి నియోజ‌క‌వ‌ర్గ గ్రామాల్లో పర్యటిస్తుండడం, అలాగే వివిధ ప‌నుల నిమిత్తం ఆయ‌న ఆఫీసుకు కూడా ఎక్కువ మంది ప్రజలు రావడం.. వాళ్లందరిని క‌లుస్తోన్న‌ నేపథ్యంలో కరోనా సోకినట్లు భావిస్తున్నారు.