55 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికిపోయారు.. విజయవాడలో మత్తు మాఫియా..

|

Nov 20, 2020 | 7:12 PM

విజయవాడలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి అమ్మకాలపై మెరుపు దాడులు చేశారు. గంజాయి సేవిస్తున్న 55 మంది విద్యార్థులను పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న..

55 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికిపోయారు.. విజయవాడలో మత్తు మాఫియా..
Follow us on

Vijayawada Task Force :  విజయవాడలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి అమ్మకాలపై మెరుపు దాడులు చేశారు. గంజాయి సేవిస్తున్న 55 మంది విద్యార్థులను పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. 55 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుపడటంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు.

ఇంకా ఏఏ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు.. ? ఇంకా ఎంత మంది గంజాయికి బానిసలుగా మారారని పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ మెరుపు దాడులు చేశారు.

ఒక్కసారిగా 55 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడటంతో అటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మంది విద్యార్థులు ఇలా గంజాయికి బానిసగా మారారోనని బెజవాడలో గుబులు మొదలైంది.