సైరా టీమ్ నుంచి మరో ట్రైలర్.. అమితాబ్ డైలాగ్ వింటే అదిరిపోతారు!

|

Sep 26, 2019 | 2:02 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాదాపు ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో నరసింహారెడ్డి, అతడి యోధులు కలిసి వీరోచితంగా బ్రిటిష్ దొరలపై చేసిన దండయాత్రను చూపించారు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో పరకాయ […]

సైరా టీమ్ నుంచి మరో ట్రైలర్.. అమితాబ్ డైలాగ్ వింటే అదిరిపోతారు!
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాదాపు ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో నరసింహారెడ్డి, అతడి యోధులు కలిసి వీరోచితంగా బ్రిటిష్ దొరలపై చేసిన దండయాత్రను చూపించారు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపిస్తోంది. ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేలా చిరు పలికిన డైలాగ్స్ ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందని చెప్పొచ్చు.

నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 2న గాంధీ జయంతి పురస్కరించుకుని విడుదల కాబోతోంది. దాదాపు 270 కోట్లతో హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నాడు.