జగన్‌ జోలికొస్తే ఖబర్దార్: పృథ్వీ

| Edited By:

Aug 15, 2019 | 4:46 PM

సీఎం జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానంటూ సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ హెచ్చరించారు. చంద్రగిరి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తిరుమలలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గబేధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు […]

జగన్‌ జోలికొస్తే ఖబర్దార్: పృథ్వీ
Follow us on

సీఎం జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానంటూ సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ హెచ్చరించారు. చంద్రగిరి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తిరుమలలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గబేధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు గానీ.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా..? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందారని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గుర్తు చేశారు.