ప్రైవేట్ ల్యాబుల్లోనూ కరోనా టెస్టులు ఫ్రీ..సుప్రీం కీల‌క సూచ‌న‌

|

Apr 08, 2020 | 3:29 PM

భారత్ లో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు విస్త‌రిస్తోంది. దీంతో ఈ నెల 14తో ముగియ‌నున్న లాక్ డౌన్ కూడా పెంచాల‌న్న యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో కరోనా టెస్టుల‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా బాధితులు రోజురోజుకు పెరుగుతోన్న‌ ప్ర‌స్తుతం ప్రైవేటు ల్యాబుల్లో సైతం కరోనా పరీక్షలు నిర్వహణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే గుర్తించిన ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై త్వ‌ర‌లోనే […]

ప్రైవేట్ ల్యాబుల్లోనూ కరోనా టెస్టులు ఫ్రీ..సుప్రీం కీల‌క సూచ‌న‌
Follow us on

భారత్ లో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు విస్త‌రిస్తోంది. దీంతో ఈ నెల 14తో ముగియ‌నున్న లాక్ డౌన్ కూడా పెంచాల‌న్న యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో కరోనా టెస్టుల‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా బాధితులు రోజురోజుకు పెరుగుతోన్న‌ ప్ర‌స్తుతం ప్రైవేటు ల్యాబుల్లో సైతం కరోనా పరీక్షలు నిర్వహణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే గుర్తించిన ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు కూడా జారీ చేస్తామని అత్యున్నత ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. ఇదే విషయమై స‌ల‌హాలు, సూచ‌న‌ల కోసం సొలిసిటర్ జనరల్‌ను సుప్రీం ప్రశ్నించింది. ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఎక్కువ‌ మొత్తాన్ని వసూలు చెయ్య‌కుండా చూడాల‌ని ప్ర‌భుత్వాల‌ను కోరింది. కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వాల‌ నుంచి రీయింబర్స్ మెంట్ పాలసీను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని తెలిపింది. అయితే సుప్రీం సూచనలపై స్పందించిన‌ సొలిసిటర్ జనరల్  తుషార్ మెహతా దీనిపై పరిశీలించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు.