సుప్రీంకోర్టులో లాలూకు ఎదురుదెబ్బ

| Edited By:

Apr 10, 2019 | 4:22 PM

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో లాలూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెయిల్‌ కోసం లాలూ జనవరి 10న ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను ఝార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లాలూ బెయిల్‌ అప్పీల్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్‌ ఎనిమిది నెలలకు పైగా ఆస్పత్రి వార్డులోనే […]

సుప్రీంకోర్టులో లాలూకు ఎదురుదెబ్బ
Follow us on

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో లాలూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెయిల్‌ కోసం లాలూ జనవరి 10న ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను ఝార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

లాలూ బెయిల్‌ అప్పీల్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్‌ ఎనిమిది నెలలకు పైగా ఆస్పత్రి వార్డులోనే ఉన్నా.. ఇప్పటికీ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కాగా లాలూ రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారని సీబీఐ తెలిపింది. ఇందుకు అక్కడికి వచ్చే విజిటర్ల జాబితానే కీలక ఆధారమని కోర్టుకు వెల్లడించింది.