విద్యార్థులు చిన్న, చిన్న విషయాలకే ఒత్తిడిలో తనువు చాలిస్తున్నారు. తాజాగా కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనే మనస్తాపంతో హాస్టల్లో ఫ్యానుకు ఉరివేసుకొని తనువు చాలించాడు. మృతుడు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్గా గుర్తించారు.
శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అవ్వటంతో హాస్టల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్లు
Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !
నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి
మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ