భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు..

|

Sep 08, 2020 | 9:18 AM

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 19, నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా రోజుల తిరుమల శ్రీవారి దర్శనం కోసం...

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు..
Follow us on

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 19, నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా రోజుల తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో గతంలో ఈ టికెట్లను టీటీడీ విడుదల చేయని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న క్రమంలో ప్రత్యేక దర్శనం టికెట్లను రిలీజ్ చేసింది. (Tirumala Darshan Tickets)

Also Read:

 ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..